1 పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువాకి కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషువ మీద చెడు పనులు చేసినట్లునింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు.
2 అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”
3 యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు.
4 అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేనుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడినాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”
5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు.
6 పిమ్మట యెహోషువాకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
8 కావున యెహోషువ, నీవూ, నీతో వున్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
9 చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెవుతున్నాడు: