1 మోయాబును గురించిన వర్తమానం ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వ శక్తిమంతుడు అయిన యోహవా ఇలా చెపుతున్నాడు,
2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు.
3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలువిను.
4 మోయాబు ధ్వంసం చేయబడుతుంది.
5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు.
6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి!
7 “మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు.
8 వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు.
9 మోయాబు పొలాలపైన ఉప్పు చల్లుము.
10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా,
11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు.
12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’
15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు.
16 “మోయాబు అంతం దగ్గర పడింది.
17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి.
18 “దీబోను వాసులారా
19 “అరోయేరు నివాసులారా,
20 “మోయాబు పాడుపడి,
21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు.
22 దీబోను, నెబో, బేత్ దిబ్లాతయీము,
23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,
24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది.
25 మోయాబు బలం తగ్గిపోయింది.
26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది.
27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు.
28 మోయాబు ప్రజలారా,
29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము.
30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు.
31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను.
32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను!
33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి.
34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది.
35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
36 “మోయాబు కొరకు నేను మిక్కిలి భిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి.
37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నాయి. ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు.
38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.
39 “మోయాబు విచ్ఛిన్న మవటంలో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు.
41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి.
42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది.
43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
44 ప్రజలు భయపడి పారిపోతారు.
45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు.
46 మోయాబూ, నీకు చెడు దాపురించింది.
47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం.