1 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది.
2 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) రాయాలి.
3 ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు.
4 యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు.
5 యెహోవా చెప్పినది ఇలా ఉంది:
6 “ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము:
7 “యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం.
8 “అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు.
9 ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.
10 “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!”
11 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!”
12 యెహోవా ఇలా అంటున్నాడు:
13 మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు.
14 మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు.
15 ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు.
16 ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు.
17 అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను.
18 యెహవా ఇలా చెప్పుచున్నాడు:
19 ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు.
20 యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
21 వారి స్వజనులలో ఒకడు వారిని నాయకత్వం వహిస్తాడు.
22 మీరు నా ప్రజలై ఉంటారు.
23 యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు!
24 తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు