1 అప్పుడు యోబు మాట్లాడటం కొన సాగించాడు:
2 “నిజంగా దేవుడు జీవిస్తున్నాడు.
3 కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,
4 నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు.
5 మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను.
6 నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు కొని ఉంటాను.
7 ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు.
8 దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు.
9 ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి,
10 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది.
11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను.
12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు.
13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే.
14 ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండ వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు.
15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది.
16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు.
17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు.
18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు.
19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు.
20 ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టు కొంటాయి.
21 తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు.
22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు.